Tuesday, September 17, 2024
Homeనేషనల్NDSA: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కేంద్ర కమిటీ

NDSA: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కేంద్ర కమిటీ

నాలుగు నెలల్లో రిపోర్ట్

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి కమిటీని నియమించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ జె. చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రకటన చేశారు. కమిటీ సభ్యులుగా యు.సి. విద్యార్థి, ఆర్. పాటిల్, శివ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా ఉండనున్నారు. నాలుగు నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రిపోర్టు సమర్పించనున్న కమిటీ, మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరును, డ్యామేజీకి గల కారణాలను పూర్తి స్థాయిలో పరిశీలించనున్న కమిటీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News