Monday, July 14, 2025
Homeనేషనల్Puri Rath Yatra: పూరి జగన్నాథ రథయాత్ర తోపులాట.. భక్తులకు సీఎం క్షమాపణలు

Puri Rath Yatra: పూరి జగన్నాథ రథయాత్ర తోపులాట.. భక్తులకు సీఎం క్షమాపణలు

Odisha CM forgiveness from devotees: పూరి జగన్నాథ రథయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రథయాత్ర సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. ఈ దుర్ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝి స్పందించారు. భక్తులకు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ఈ ఘటన పట్ల వ్యక్తిగతంతో పాటు తన ప్రభుత్వం తరఫును పూరి జగన్నాథ భక్తులందరినీ క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. శారదబలి వద్ద మహాప్రభువును చూడటానికి భక్తులు ఆసక్తి చూపిన కారణంగా జరిగిన తోపులాట పరిస్థితుల కారణంగా ఈ దురదృష్టకర సంఘటన జరిగిందన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని ఆయన వెల్లడించారు.

కాగా ఇవాళ తెల్లవారుజామున 4:30 గంటలకు రథాలు గుండిచా ఆలయం దగ్గరకు వచ్చిన సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ఒడిశా ఖుర్దా జిల్లాకు చెందిన ప్రభాతి దాస్(42), బసంతీ సాహూ(36), ప్రేమకాంత్ మహాంతి (80)గా గుర్తించారు. ఇక గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

పూరీలో ప్రతి ఏడాది జరిగే జగన్నాథ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను రథాలలో ఊరేగిస్తూ గుండిచా ఆలయానికి తీసుకెళ్లే ఈ ఉత్సవం ఆధ్యాత్మికం శోభ సంతరించుకుంటుంది. శనివారం ప్రారంభమైన రథయాత్రకు భక్తులు భారీగా తరలిరావడంతో దాదాపు 750 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News