Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుPune - హైవే పై లారీ బీభత్సం.. 48 వాహనాలు ధ్వంసం

Pune – హైవే పై లారీ బీభత్సం.. 48 వాహనాలు ధ్వంసం

పూణె- బెంగళూరు హైవే పై ఓ లారీ సృష్టించిన బీభత్సానికి 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. నవ్ లే బ్రిడ్జి వద్ద ఈ ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ ట్యాంకర్ లారీ.. ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 48 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొని.. ధ్వంసమయ్యాయి. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాద ఘటనలో 30 మందికి గాయాలవ్వగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

ప్రమాదంపై సమాచారం అందుకున్న పూణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్ లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ట్యాంకర్లోని ఆయిల్ రోడ్డుపై పడటంతో.. మిగతా వాహనాల టైర్లు జారి ఒకదానినొకటి ఢీ కొన్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad