Monday, April 14, 2025
Homeనేషనల్Parliament new building: పార్లమెంట్ కొత్త భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన మోడీ

Parliament new building: పార్లమెంట్ కొత్త భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్టుండి ఈరోజు పార్లమెంట్ నూతన భవన నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు.  పార్లమెంట్ కొత్త భవన నిర్మాణ పనులు తుది అంకానికి చేరుకున్నాయి.  సెంట్రల్ విస్టాలోని కొన్ని పనులు పునఃఅభివృద్ధిలో ఉన్నాయి. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ నిర్మాణాన్ని చేపడుతోంది.  పెద్ద హాల్స్, లైబ్రరీ, భారీ పార్కింగ్ ప్లేస్, కమిటీ రూములు..ఇలా దేనికవి గొప్పగా, అనుకూలంగా ఉండేలా ఆధునిక వసతులు, సాంకేతికతతో నిర్మిస్తున్నారు. గంటకు పైగా ఈ పనులన్నీ మోడీ పరిశీలించారు.  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా మోడీ వెంట ఉన్నారు. నిజానికి గత ఏడాది నవంబర్ నుంచే ఈ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కావాల్సి ఉన్నా అది జరగలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News