Saturday, November 15, 2025
Homeనేషనల్PM KISAN: రైతులకు గుడ్‌న్యూస్‌.. నవంబర్‌ మొదటి వారంలో పీఎం కిసాన్‌ నిధులు జమ..!

PM KISAN: రైతులకు గుడ్‌న్యూస్‌.. నవంబర్‌ మొదటి వారంలో పీఎం కిసాన్‌ నిధులు జమ..!

PM Kisan 21st Installment ready to transfer into Farmers Bank Account: రైతులకు గుడ్‌న్యూస్‌. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 6 వేల చొప్పున ప్రతి నాలుగు నెలలకోసారి పీఎం కిసాన్‌ కింద నగదు జమచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 20 విడతల్లో నగదు జమచేయగా.. వచ్చే నెల ప్రారంభంలో 21వ విడత నిధులు జమ చేసేందుకు సిద్ధమవుతోంది. దీని ద్వారా దేశంలోని 8.5 కోట్ల మంది అర్హులైన రైతులకు ఒక్కొక్కరికీ రూ.2 వేల చొప్పున అందనున్నాయి. గతేడాది, ప్రభుత్వం ఇదే కాలంలో 10వ, 14వ, 20వ విడతలను విడుదల చేసింది. అందువల్ల, ఈసారి కూడా నవంబర్‌లోనే నిధులను జమ చేయనుంది. ఈ స్కీమ్‌ కింద నగదు బ్యాంకులో జమకావాలంటే లబ్ధిదారులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. వారి ఆధార్‌ను బ్యాంక్‌ అకౌంట్‌ లింక్‌ చేసి ఉండాలి. తద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(DBT) కింద కేంద్రం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేస్తుంది. రైతులు తమ ఆధార్ లేదా బ్యాంక్ అకౌంట్‌ నంబర్‌ను ఉపయోగించి www.pmkisan.gov.inలో వారి ట్రాన్సాక్షన్‌ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. కాగా, ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హత కలిగిన రైతులకు కేంద్రం ప్రతి ఏడాది రూ.6 వేలను అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికీ రూ.2 వేల చొప్పున మూడు వాయిదాల్లో చెల్లిస్తోంది. భారతదేశం అంతటా వ్యవసాయ వృద్ధిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

- Advertisement -

ఈ-కేవైసీ, ఆధార్‌ లింక్‌ పూర్తి చేయాలి..

కాగా, కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు ఒక విడతగా డబ్బును విడుదల చేస్తుంది. చివరి విడత ఆగస్టులో రైతుల ఖాతాలకు పంపబడింది. వచ్చే విడత నవంబర్ ప్రారంభం నాటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు, ఈ పథకం కింద రైతులకు రూ. 3 లక్షల కోట్లకు పైగా నగదు చెల్లింపులు చేసింది. 21వ విడత రాకముందే, వారి ఖాతాల్లో లేదా భూమి రికార్డులలో వ్యత్యాసాలు ఉన్న రైతులు వాటిని నవీకరించాలి. ఈ సంవత్సరం భారీ వర్షాలు, వరదల బారిన పడిన మూడు రాష్ట్రాలకు ప్రభుత్వం ఇప్పటికే 21వ విడతను పంపింది. ఇప్పుడు, ఇతర రాష్ట్రాల రైతులకు కూడా నగదు జమ చేయనుంది. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక సమాచారాన్ని విడుదల చేయలేదు. 21వ విడత రాకముందే, రైతులు రెండు ముఖ్యమైన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తెలిపింది. మొదటగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పోర్టల్ ద్వారా లేదా సమీపంలోని సాధారణ సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అనంతరం, రాష్ట్ర రెవెన్యూ పోర్టల్‌లో రైతు భూమి రికార్డులను ధృవీకరించాలి. ఈ ప్రక్రియలలో ఏదైనా అసంపూర్ణంగా ఉంటే, వాయిదా చెల్లింపును నిలిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad