Saturday, November 15, 2025
Homeనేషనల్Modi casts first vote in Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికలో తొలి...

Modi casts first vote in Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు మోదీదే

Modi casts vote in Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోలింగ్​ ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు ప్రారంభమైన పోలింగ్​ ప్రారంభం కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి వేటును వేశారు. పార్లమెంట్ హౌస్‌లోని వసుధ ఎఫ్‌ 101లో పోలింగ్ నేటి ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్​..సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. విజేత ఎవరో ఈ సాయంత్రం తెలిసిపోతుంది.

- Advertisement -

కాగా ఉప రాష్ట్రపతి ఎన్నికపై ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్, ఇండియా కూటమి క్యాండిడేట్​ జస్టిస్​ సుదర్శన్​ రెడ్డి గెలుపు ధీమాతో ఉన్నారు.

ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్​సభ సభ్యులతోపాటు ఈ సభలకు నామినేట్​ అయిన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ఉంది. ఈ ఎన్నికకు బీఆర్​ఎస్​, బీజేడీ, శీరోమణి అకాలీదళ్​ పార్టీలు దూరంగా ఉన్నాయి.

 

క్రాస్​ ఓటింగ్​ భయం

కాగా ఈ ఎన్నికలోనూ క్రాస్​ ఓటింగ్​ భయం వెంటాడుతుంది. గతంలో బీజేపీ అభ్యర్థిగా జగ్​దీప్​ ధన్​ఖడ్​ పోటీ చేసిన సమయంలో 2022లో ఇతర పార్టీలకు చెందిన వారు ఓటు వేశారు. ఈసారి ఎన్డీయేకు రాజ్యసభ, లోక్​సభలో మొత్తం 427 మంది సభ్యుల బలం ఉంది. వైఎస్సార్​సీపీ ఎన్డీయే మద్దతు ప్రకటించింది. కాగా గెలుపును ఖరారు చేసిన మ్యాజిక్​ ఫిగర్​ 386 మార్కును ఎన్డీయే ఈజీగా దాటేసింది. అయితే ఫలితం వెలువడేదాకా ఆ సంగతి బయటపడదు. ఎందుకంటే ఎవరైన క్రాస్​ ఓటింగ్​కు పాల్పడితే ఎన్డీయేకు కష్టమే. ఈ ఎన్నికలో పార్టీలు విప్​ జారీ చేయలేదు. దీంతో క్రాస్​ ఓటింగ్​పై ఇండియా కూటమి బాగా ఆశలుపెట్టుకుంది.

ఇండియా కూటమికి 315 సభ్యుల బలం ఉంది. ఆమ్​ ఆద్మీ పార్టీకి చెందిన 12 మంది సభ్యులు జస్టిస్​ సుదర్శన్​ రెడ్డికి ఓటు వేయవచ్చన్న ఆశాభావం కనిపిస్తోంది. అయితే ఆ పార్టీ మెంబర్​ స్వాతి మాలివాల్​ ఆప్ కు దూరంగా ఉన్నారు. ఒకవేళ మాలివాల్​ ఓటు వేసిన ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్​ గెలుపును అడ్డుకోలేరని కూటమి సభ్యులు పేర్కొన్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసే విధానంపై ఎన్డీయే, ఇండియా  కూటమి ఓటర్లయిన పార్లమెంటు సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే.

గెలుపు లాంఛనమే
ఎలక్టోరల్​ కాలేజ్ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికలకు భిన్నంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో లోక్‌సభ, రాజ్యసభలో సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియలో భాగం కారు. అయితే, ప్రస్తుతం లోక్‌సభలో 542, రాజ్యసభలో 239 మంది సభ్యులున్నారు. ఈ 782 సభ్యుల్లో మెజార్టీ సభ్యులు ఎవరిని ఎన్నుకుంటే వారే ఉపరాష్ట్రపతి అవుతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad