కెనడాలోని ఆల్బెర్టా ప్రావిన్స్ కననాస్కిస్లో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న జీ7 సమ్మిట్(G7 Summit)కు భారతదేశానికి ఆహ్వానం అందింది. ఈమేరకు ప్రధాని మోడీకి(PM Modi)కెనడా ప్రధాని మార్క్ కార్నే ఫోన్ చేసి సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ విషయాన్ని మోడీ ఎక్స్ ద్వారా వెల్లడించారు.
కెనడా ప్రధాని కార్నేతో ఫోన్లో మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంపై ఆయనను అభినందించినట్లు పేర్కొన్నారు. . కనానాస్కిస్లో జరిగే జీ7 సదస్సుకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పారు. భారత్- కెనడా శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా కలిసి పనిచేస్తాయన్నారు. మార్క్ కార్నేతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు.
కాగా 51వ జీ-7 సదస్సుకు కెనడా ఆతిథ్యం ఇస్తుంది. జీ7 దేశాల్లో భారత్ లేన్నప్పటికీ.. ఆతిథ్య దేశాల ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ శిఖరాగ్ర సదస్సుల్లో పలుమార్లు పాల్గొన్నారు. గతేడాది ఇటలీ వేదికగా జరిగిన సదస్సుకు భారత్తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికాతో పాటు పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం పాల్గొన్నాయి. జీ7 దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా ఉన్నాయి.