Sunday, June 22, 2025
Homeనేషనల్PM Modi: యోగాంధ్ర గిన్నిస్ రికార్డుపై ప్రధాని మోదీ హర్షం

PM Modi: యోగాంధ్ర గిన్నిస్ రికార్డుపై ప్రధాని మోదీ హర్షం

PM Modi Praises yogandhra guinness-record: ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర- 2025’ కార్యక్రమం గిన్నిర్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. 11వ యోగా దినోత్సవం కార్యక్రమం నిర్వహించే బాధ్యత ఏపీ ప్రభుత్వానికి దక్కింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేశారు.

ప్రధాని మోదీతో పాటు ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు మొత్తం 3.20లక్షల మంది ఒకే విధంగా యోగాసనాలు వేశారు. ఈ యోగా ప్రదర్శన చూపరులను అబ్బురపరిచింది. ఈ నేపథ్యంలో 2003లో గుజరాత్ లోని సూరత్ లో 1,47,952 మందితో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. దీంతో యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. ఈమేరకు గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ధృవపత్రాలను మంత్రి నారా లోకేశ్, సీఎస్ విజయానంద్‌లకు అందజేసిన విషయం విధితమే.

యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు యోగా ప్రాముఖ్యతను మరోసారి తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. యోగా ప్రజలను మరోసారి ఏకం చేసిందన్నారు. యోగాను తమ జీవితాల్లో భాగం చేసుకోవాలనే ఉద్యమాన్ని బలోపేతం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభినందనలు తెలిపారు. తాను కూడా పాల్గొన్న యోగాంధ్ర కార్యక్రమం మంచి ఆరోగ్యం, శ్రేయస్సు దిశగా ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని జరగాలని ప్రధాని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News