Monday, March 31, 2025
Homeనేషనల్PM Modi: ప్రధాని మోదీ శ్రీలంక, థాయ్‌లాండ్ పర్యటన షెడ్యూల్ ఖరారు

PM Modi: ప్రధాని మోదీ శ్రీలంక, థాయ్‌లాండ్ పర్యటన షెడ్యూల్ ఖరారు

భారత ప్రధాని మోదీ (PM Modi) వచ్చే నెలలో శ్రీలంక, థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈమేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ మొదటి వారంలో మోదీ ఆయా దేశాలకు వెళ్లనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పర్యటనలో ఆయా దేశాలతో దౌత్యసంబంధాలపై ప్రధానంగా చర్చించనట్లు సమాచారం. ఇక మే 2022 నుంచి డిసెంబర్ 2024 వరకు మోదీ విదేశీ పర్యటన ఖర్చు రూ.258 కోట్లు అయినట్లు పలు కథనాలు వెల్లువడిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇదిలా ఉంటే ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజున తమిళనాడులోని రామేశ్వరాన్ని సందర్శిస్తారు. ఈ పర్యటన సందర్భంగా కొత్తగా నిర్మించిన పంబన్ వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం రామనాథస్వామి ఆలయంలో ప్రార్థనలు చేస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News