Sunday, July 7, 2024
Homeనేషనల్PMO: తనకోసం ఒక్క రూపాయి ప్రజాధనం ఉపయోగించని ప్రధాని మోడి

PMO: తనకోసం ఒక్క రూపాయి ప్రజాధనం ఉపయోగించని ప్రధాని మోడి

మెడికల్ ఖర్చులు స్వయంగా చెల్లిస్తున్న మోడీ తన వైద్య కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకోలేదంటూ ఆర్టీఐ ద్వారా తేలింది. మే 2014 నుంచి తన వ్యక్తిగత వైద్య ఖర్చుల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సొంతంగా భరించారని ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రఫుల్ల సర్దా అనే పూనేకు చెందిన ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన అప్లికేషన్ పై ప్రధాన మంత్రి కార్యాలయం ఈమేరకు రిప్లై ఇచ్చింది.

- Advertisement -

ఫిట్ ఇండియా అంటూ నినాదాలు మాత్రమే ఇవ్వకుండా స్వయంగా ఆచరించి చూపుతున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ, 135 కోట్ల మంది భారత ప్రజానీకానికి ఆయన ఉదాహరణ అంటూ ప్రఫుల్ల సర్దా పేర్కొన్నారు. పీఎంవోలో ఒక్క రూపాయి ప్రజాధనాన్ని కూడా వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించటం లేదని, దీంతో సర్కారుపై తమ విశ్వాసం మరింత పెరిగిందని ఆయన చెబుతున్నారు. దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ప్రధాని మోడీ అడుగుజాడల్లో నడవాలని ప్రఫుల్ల అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News