Droupadi Murmu: భాతర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురి వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేశారు. మాజీ దైత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, కేరళకు చెందిన సామాజిక కార్యకర్త సదానందన్ మాస్టర్లను రాష్ట్రపతి పెద్దల సభకు నామినేట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా నామినేట్ అయిన నలుగురికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇక రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అది కూడా సామాజిక సేవ, కళలు, సాహిత్యం, సైన్స్ వంటి రంగాలలో కృషి చేసిన వారిని ఈ స్థానాలకు నామినేట్ చేస్తారు. తాజాగా రాష్ట్రపతి నామినేట్ చేసిన నలుగురి వ్యక్తుల వివరాల గురించి తెలుసుకుందాం.
హర్ష్ వర్ధన్ శ్రింగ్లా: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి హోదాలో అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాల్లో రాయబారిగా విధులు నిర్వహించారు. 2023లో భారతదేశం అతిథ్యం వహించిన G20 ప్రెసిడెన్సీకి చీఫ్ కోఆర్డినేటర్గా పనిచేశారు.
డాక్టర్. మీనాక్షి జైన్: ప్రముఖ చరిత్రకారిణిగా గుర్తింపు పొందారు. అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. విద్యా రంగంలో ఆమె చేసిన కృషికి 2020లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగానూ విధులు నిర్వర్తించారు.
Also Read: డీజిల్ లోడ్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. ఎక్కడంటే..?


