Saturday, November 15, 2025
Homeనేషనల్Rahul Gandhi : ఓట్ల చోరీతోనే మోదీ గెలుప - ఈసారి ఆ పప్పులుడకవ్......

Rahul Gandhi : ఓట్ల చోరీతోనే మోదీ గెలుప – ఈసారి ఆ పప్పులుడకవ్… రాహుల్ గాంధీ ఫైర్!

Election result manipulation claims :  గత ఎలక్షన్స్‌లో ప్రజలు ఒకలా ఓట్లేస్తే, రిజల్ట్స్ మాత్రం వేరేలా వచ్చాయి.  కేంద్ర ఎన్నికల సంఘంతో కుమ్మక్కైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ‘ఓట్ల చోరీ’కి పాల్పడి అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇది ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి. కానీ ఈసారి ఆ ఆటలు సాగనివ్వం. బిహార్ ప్రజల ఓటు హక్కును కాలరాయాలని చూస్తే ‘ఇండియా’ కూటమి చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

- Advertisement -

ఈసీతో కుమ్మక్కు.. రాజ్యాంగంపై దాడి : ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో భాగంగా బిహార్‌లోని ముంగేర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై విమర్శల వర్షం కురిపించారు. “కేంద్ర ఎన్నికల సంఘంతో చేతులు కలిపి ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ అనే ముసుగులో బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాగే ఫలితాలను తారుమారు చేసి గద్దెనెక్కింది. కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను దోచిపెట్టడమే వారి ఏకైక అజెండా,” అని రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ, ఈసీలు కలిసి బిహార్ ప్రజల ఓటు హక్కును లాక్కోవాలని చూస్తే ‘ఇండియా’ కూటమి దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని ఆయన స్పష్టం చేశారు.

దొంగిలించిన ఓట్లతోనే ప్రభుత్వం : అంతకుముందు, ఔరంగాబాద్ జిల్లా యువతతో సమావేశమైన సందర్భంగా రాహుల్ ఇదే విషయంపై మాట్లాడుతూ, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దొంగిలించిన ఓట్లతో ఏర్పడిందేనని ఘాటుగా విమర్శించారు. అలాంటి ప్రభుత్వానికి ప్రజాసేవ చేసే నైతిక హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. “స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలకు పారదర్శకమైన ఓటరు జాబితాలే పునాది. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలు తమ ఓటు హక్కు అనే మహాశక్తిని వినియోగించాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.

రాహులే ప్రధాని : రాహుల్ గాంధీ యాత్రలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ భాగస్వామ్యం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీనే దేశానికి ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బిహార్‌లోని బలహీనమైన ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓట్ల చోరీ వ్యవహారంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు, మిగతా ఇద్దరు కమిషనర్లపై కూడా ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ గతంలో హెచ్చరించిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad