లారీలో కో డ్రైవర్ గా కూర్చుని ప్రయాణించారు రాహుల్ గాంధీ. సిమ్లాకు వెళ్తున్న రాహుల్ గాంధీ నిన్న రాత్రి ఇలా ఢిల్లీ-అంబాలా వెళ్తున్న లారీలో కూర్చుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సిమ్లాకు వెళ్తున్న రాహుల్ కు హర్యానాలోని సోనిపేట్ లోని ఓ ఢాబా వద్ద లారీ కనిపించింది. అంతే అది ఎక్కి, వారి కష్టనష్టాలు తెలుకుంటూ ప్రయాణించేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన కాంగ్రెస్ పార్టీ దేశంలో 90 లక్షల మంది లారీ డ్రైవర్లుండగా, వారి మన్ కి బాత్ తెలుసుకునే ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ చేశారని పార్టీ వివరిస్తోంది. కర్నాటక ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ ఇలాంటి ప్రయత్నమే చేస్తూ.. సిటీ బస్సు ఎక్కి అందులోని మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు. భారత్ జోడో యాత్ర తరువాత రాహుల్ గాంధీ ఇలా ప్రజలతో మమేకం అయి అందరినీ పలకరిస్తుండటం విశేషం.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/1cba23dc-628c-4d04-9c69-a5b738352e37-1024x687.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/9cf32b82-39e0-41ef-b89e-a084165797f4.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/804fdfc0-406b-4940-9eae-9c155c27fe58.jpg)