Thursday, June 5, 2025
Homeనేషనల్ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు.. ఎంత పెద్ద మాటన్నారంటే..?

ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు.. ఎంత పెద్ద మాటన్నారంటే..?

మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమార్శలు గుప్పించారు. ఈ మీటింగ్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ చర్చలకు దారి తీశాయి. “నరేంద్ర కాదు.. స‌రెండ‌ర్ మోదీ” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించిన రాహుల్‌.. ఆపరేషన్ సింధూర్‌ను కేంద్రం డ్రామా మాదిరిగా ప్రదర్శించిందని విమర్శించారు.

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒత్తిడికి ప్రధాని మోదీ తలవంచారని రాహుల్‌ ఆరోపించారు. ట్రంప్ బెదిరించగానే మోడీకి భయం వేసిందని.. అదే కారణంతో పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ప్రకటించారని ధ్వజమెత్తారు. భారత శక్తి ఏంటో నాడు ఇందిరా గాంధీ చూపించారని రాహుల్ గుర్తు చేశారు. ఆమె ఏ దేశ బెదిరింపులకు లొంగిపోలేదని పేర్కొన్నారు.

అంతేకాదు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కేంద్రం ముందుగానే పాకిస్తాన్‌కు సమాచారమిచ్చిందని గతంలో చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. తాజాగా మళ్లీ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు సరెండర్ అవడం అలవాటే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ వర్గాలు తీవ్ర స్థాయిలో స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ చుట్టూ రాజకీయం మరింత వేడెక్కింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News