Sunday, October 6, 2024
Homeనేషనల్రస్నా డ్రింక్ వ్యవస్థాపకుడు అరీజ్ ఫిరోజ్ షా కన్నుమూత

రస్నా డ్రింక్ వ్యవస్థాపకుడు అరీజ్ ఫిరోజ్ షా కన్నుమూత

ఒకప్పుడు సాఫ్ట్ డ్రింక్ అంటే గుర్తొచ్చేది రస్నానే. అప్పట్లో దానికున్న గిరాకీనే వేరు. ‘ఐ లవ్ యూ రస్నా’ ప్రకటన ఎంతో ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన ‘రస్నా’ వ్యవస్థాపకుడు అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా(85) ఇక లేరు. నవంబర్ 19, శనివారం రోజున ఆయన తుదిశ్వాస విడిచారని రస్నా కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.

- Advertisement -

రస్నా బ్రాండ్ సాఫ్ట్ డ్రింక్ 60 దేశాలకు ఎగుమతి అవుతోంది. కూల్ డ్రింక్ ల ధరలు పెరిగిపోతున్న సమయంలో మార్కెట్లోకి అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది వినియోగదారుల్ని సంపాదించుకుంది. రూ.5 ల ప్యాకెట్ తో 32 గ్లాసుల డ్రింక్ ను తయారుచేసుకునేలా ఈ ప్రాడక్ట్ ను అరీజ్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. బెనోవోలెంట్ ట్రస్ట్ ఛైర్మన్ గా, ప్రపంచ పార్సీ ఇరానీ జొరాస్టిస్ ఛైర్మన్ గా కూడా ఆయన వ్యవహరించారు. అరీజ్ మరణంపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News