Friday, June 6, 2025
Homeనేషనల్Bengaluru: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి..!

Bengaluru: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానుల విజయానందంలో విషాదం చోటుచేసుకుంది. ఐపీఎల్ 2025లో తమ తొలి ట్రోఫీని సాధించిన ఆనందంలో ఉన్న ఆ జట్టును.. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఘోర సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. IPL చరిత్రలో తొలిసారి ఆర్సీబీ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని అభిమానులతో కలిసి పంచుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో గ్రాండ్ ఫెలిసిటేషన్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఉత్సవం ఊహించని ఘటన జరిగింది.

- Advertisement -

అభిమానులు వేలాదిగా స్టేడియాన్ని చేరుకోవడంతో.. ఉదయం నుంచే అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఎంతో మంది అభిమాలు స్టేడియంకు చేరుకున్నారు. టికెట్లు లేకపోయినా వేలాదిగా తరలి వచ్చారు. గేట్ల దగ్గర భారీగా క్యూ కట్టారు. అయితే మధ్యాహ్నం సమయానికి నియంత్రణ తప్పిపోయి, గేట్ల దగ్గర తీవ్రంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా పలువురు గాయాలపాలయ్యారు. వెంటనే వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసుల నిర్లక్ష్యం, నిర్వాహకుల దారుణమైన ప్లానింగ్ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది సెలబ్రేషన్ కాదు.. అభిమానులపై చేసిన న్యాయమికాని అవమానం” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం స్పందిస్తూ, “ఇది ఎంతో బాధాకరం. మేము పూర్తి సహకారం అందిస్తాం. బాధిత కుటుంబానికి మేము మద్దతుగా ఉంటాం” అని ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News