Friday, June 6, 2025
Homeనేషనల్Stampede: చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట.. కారణం ఇదే..!

Stampede: చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట.. కారణం ఇదే..!

ఐపీఎల్ 2025 ట్రోఫీ విన్నర్ ఆర్సీబీ విజయోత్సవంలో విషాదం నెలకొంది. ఆర్సీబీ విక్టరీ పరేడ్ ను వీక్షించేందుకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10మంది చనిపోగా, 50మందికిపైగా గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

- Advertisement -

ఆర్సీబీ జట్టుకు చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమ అభిమాన ఆటగాళ్లను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. స్టేడియం గేట్లను తోసుకుని అభిమానులు ముందుకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. స్టేడియం గేట్లు సరైన సమయంలో తెరవకపోవడంతో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. గేట్లు తెరవకపోవడంతో అభిమానులు ముందుకు దూసుకెళ్లారు. దీంతో పరిస్థితి మరింత క్షీణించింది.

భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. కేవలం పాస్ లు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని చెప్పినప్పటికీ, అభిమానులంతా స్టేడియం వైపు ఎగబడ్డారు. ఈ కారణంగా స్టేడియం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. పోలీసులు లక్షల మంది అభిమానులను అదుపు చేయడం కష్టమయ్యిందని వాపోయారు. తొక్కిసలాటతో స్టేడియం నుంచి వెళ్లిపోవాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో మెట్రో సేవలు నిలిపివేశారు. తొక్కిసలాటలో జబ్బుపడ్డవారిని పోలీసులు సీపీఆర్ చేశారు కానీ, వారి ప్రాణాలను కాపాడలేకపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News