Saturday, November 15, 2025
Homeనేషనల్Novelist SL Bhyrappa: ప్రముఖ కన్నడ రచయిత ఎస్.ఎల్. భైరప్ప కన్నుమూత.. సాహిత్య లోకంలో విషాదం

Novelist SL Bhyrappa: ప్రముఖ కన్నడ రచయిత ఎస్.ఎల్. భైరప్ప కన్నుమూత.. సాహిత్య లోకంలో విషాదం

Renowned Kannada Novelist SL Bhyrappa Dies At 94: ప్రముఖ కన్నడ నవలా రచయిత, తత్వవేత్త డాక్టర్ ఎస్.ఎల్. భైరప్ప 94 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. బుధవారం మధ్యాహ్నం బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. భారతీయ సాహితీ లోకంలో ఆయన మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.

- Advertisement -

ALSO READ: Karnataka High Court: ఎలాన్ మస్క్ ‘X’కు భారీ ఎదురుదెబ్బ.. “భారత్‌లో సోషల్ మీడియాను నియంత్రించాల్సిందే”

డాక్టర్ ఎస్.ఎల్. భైరప్ప ఆధునిక కన్నడ సాహిత్యంలో అత్యంత గొప్ప రచయితలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన రచనలు సమాజంలోని వివిధ పార్శ్వాలను, మానవ సంబంధాల సంక్లిష్టతలను, తాత్విక అంశాలను లోతుగా విశ్లేషించాయి. ‘వంశవృక్ష’, ‘దాటు’, ‘పర్వ’, ‘మందార’ వంటి నవలలు ఆయనకు విశేష కీర్తిని తెచ్చిపెట్టాయి. ఈ నవలలు తెలుగుతో సహా అనేక భారతీయ భాషల్లోకి, ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి.

సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, సరస్వతి సమ్మాన్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఆయన అందుకున్న ప్రధాన గౌరవాలు.

భైరప్ప మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. “శ్రీ ఎస్.ఎల్. భైరప్ప జీ మరణంతో.. మన అంతరాత్మను కదిలించి, భారతదేశపు ఆత్మను లోతుగా పరిశీలించిన ఒక గొప్ప రచయితను కోల్పోయాం. నిర్భయమైన, కాలాతీతమైన ఆలోచనాపరుడు ఆయన. తన ఆలోచనలను రేకెత్తించే రచనలతో కన్నడ సాహిత్యాన్ని ఆయన సుసంపన్నం చేశారు. ఆయన రచనలు సమాజాన్ని మరింత లోతుగా ఆలోచించడానికి, ప్రశ్నించడానికి, అర్థం చేసుకోవడానికి అనేక తరాలను ప్రేరేపించాయి.

ALSO READ: Maharashtra: కాంగ్రెస్ నేతకు చీర కట్టించిన బీజేపీ కార్యకర్తలు.. అసలేం జరిగిందంటే?

మన చరిత్ర, సంస్కృతి పట్ల ఆయనకున్న అచంచలమైన తపన భవిష్యత్ తరాలకు కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.” అని మోదీ ట్వీట్ చేశారు.

డాక్టర్ భైరప్ప రచనలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. ‘నాయి-నేరళు’, ‘మాతదాన’, ‘వంశవృక్ష’, ‘తబ్బలియు నీనాదే మగనే’ వంటి ఆయన నవలలు చలన చిత్రాలుగా రూపొందాయి. అలాగే ‘గృహభంగ’, ‘దాటు’ వంటి రచనలు దూరదర్శన్ సీరియల్స్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఆయన మరణం కన్నడ సాహిత్యానికి తీరని లోటు. ఆయన సాహిత్య వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.

ALSO READ: Himachal Pradesh: డైలాగ్ చెబుతూ.. స్టేజ్‌ మీదే కుప్పకూలిన నటుడు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad