Sunday, November 16, 2025
Homeనేరాలు-ఘోరాలుRoad Incident: మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు మృతి

Road Incident: మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు మృతి

మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రం షిరిడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం(Road Incident) జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలతో పాటు ఆరు నెలల చిన్నారి కూడా ఉంది.

- Advertisement -

మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప వాసులుగా గుర్తించారు. మృతుల్లో ప్రేమలత (59), వైద్విక్ నందన్ (6 నెలలు), అక్షిత (20), ప్రసన్న లక్ష్మి(45) ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కొండగడపలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దైవ దర్శనానికి వెళ్లిన వారు ఇలా విగతజీవులుగా మారడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad