Saturday, November 15, 2025
Homeనేషనల్Shashi Tharoor: వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు- కేసీఆర్‌ కుటుంబంపై సంచలన కామెంట్స్‌

Shashi Tharoor: వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు- కేసీఆర్‌ కుటుంబంపై సంచలన కామెంట్స్‌

Shashi Tharoor Comments on Dynastic Politics: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌, కూతురు కవిత మధ్య వారసత్వ పోరు కొనసాగుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలు భారత ప్రజాస్వామ్యానికి ముప్పు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారసత్వ నాయకత్వంలో పాలనా నాణ్యత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. ఒక వార్తా సంస్థ కథనంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/mp-mallu-ravi-comments-on-chevella-bus-accident/

వారసత్వ రాజకీయాల్లో ప్రతిభకు పట్టం కట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. సామర్థ్యం, నిబద్ధత, క్షేత్రస్థాయిలో పనితీరు వంటి అంశాల ఆధారంగా రాజకీయ అధికారం ఇవ్వాలని ఆయన అన్నారు. అలా కాకుండా వారసత్వం ద్వారా రాజకీయ అధికారాన్ని నిర్ణయిస్తే పరిపాలనా నాణ్యత దెబ్బతింటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల్లోనూ కుటుంబ రాజకీయాలు సహజంగా కనిపిస్తుంటాయని.. శశిథరూర్‌ వ్యాఖ్యానించారు.

‘నెహ్రూ-గాంధీ వంశ ప్రభావం స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉండటం రాజకీయ నాయకత్వం అనేది పుట్టుకతో వచ్చే హక్కు అనే భావనను ఇది స్థిరపరిచింది. ప్రతి పార్టీ, ప్రాంతం, స్థాయిలోనూ ఇది చొచ్చుకుపోయింది. ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్‌గా ఉపయోగపడటం ఈ తరహా రాజకీయాలకు ఒక కారణం కావొచ్చు. బిజూ పట్నాయక్-నవీన్ పట్నాయక్, బాల్ ఠాక్రే-ఆదిత్య ఠాక్రే, ములాయం సింగ్ యాదవ్- అఖిలేశ్ యాదవ్, ఫరూఖ్ అబ్దుల్లా- ఒమర్ అబ్దుల్లా, కరుణానిధి-  ఎం.కె. స్టాలిన్- ఉదయనిధి వంటి వారు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారు.’ – ఎంపీ శశిథరూర్‌

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/pawan-kalyan-karthika-masam-devotee-safety-orders-kakinada-district/

ఈ సందర్భంగానే శశిథరూర్‌.. కేసీఆర్ వారసుల అంశాన్ని ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. కుటుంబంలో ఒకరికి గుర్తింపు లభిస్తే తదుపరి తరం అభ్యర్థులకు ఓటర్లను ఆకట్టుకోవడానికి, విశ్వాసాన్ని పెంచుకోవడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ప్రతిభను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందని శశిథరూర్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం ఓటర్లకు అవగాహన కల్పించడం, పార్టీలో అంతర్గత ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడం వంటి ప్రాథమిక సంస్కరణలు చేయడం కీలకమని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad