Saturday, November 15, 2025
Homeనేషనల్Shashi Tharoor: ట్రంప్‌ టారిఫ్‌లతో ఉద్యోగాలు పోతాయ్‌.. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

Shashi Tharoor: ట్రంప్‌ టారిఫ్‌లతో ఉద్యోగాలు పోతాయ్‌.. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కీలక వ్యాఖ్యలు

Shashi Tharoor Comments on Trump Tarrifs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై ఎక్కువ ఉంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ స్పష్టం చేశారు. ఈ టారిఫ్‌ల వల్ల ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారని, లక్షల్లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంని అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ వ్యవహారశైలి, స్వభావం పూర్తి గందరగోళంగా ఉందంటూ మండిపడ్డారు. సింగపూర్‌లో క్రెడాయ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంప్రదాయ దౌత్య ప్రమాణాలను అమెరికా అధ్యక్షుడు అస్సలు గౌరవించడం లేదు. ట్రంప్‌ కన్నా ముందు 44 మంది అధ్యక్షులుగా పనిచేసినప్పటికీ.. వైట్‌హౌస్‌ నుంచి ఈ రకమైన ప్రవర్తన ఎన్నడూ చూడలేదు. ఏ రకంగా చూసినా ఆయన ఒక అసాధారణ అధ్యక్షుడు. సంప్రదాయ దౌత్య ప్రమాణాలను ఆయన అస్సలు గౌరవించడం లేదు. నోబెల్‌ శాంతి బహుమతికి అర్హుడనని ఏ దేశాధినేత అయినా స్వయంగా ప్రకటించుకోవడం ఎప్పుడైనా విన్నామా? ప్రపంచంలోని అన్ని దేశాలు మా వద్దకే వచ్చి మోకరిల్లుతాయని చెప్పడం విన్నామా? భారత్‌, రష్యాలవి డెడ్‌ ఎకానమీలు అని చెప్పడం ఎప్పుడైనా విన్నామా? ఓ దేశాధ్యక్షుడి నుంచి వినిపించకూడని మాటలు ఇవి. అందుకే ఆయనో అసాధారణ వ్యక్తి. ట్రంప్‌ ప్రవర్తన అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది.’’ అని దాదాపు 1000 మందికి పైగా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, కన్సల్టెంట్‌లు పాల్గొన్న ఈ సమావేశంలో శశిథరూర్‌ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

భారత్‌ను దూరం చేసుకుంటే అమెరికాకే నష్టం..

‘‘సుంకాల ప్రభావం భారత్‌పై చూపిస్తోంది. ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. సూరత్‌లోనే ముత్యాలు, ఆభరణాల వ్యాపారంలో 1.35 లక్షల మందికి లేఆఫ్‌లు విధించారు. సముద్రపు ఆహారం, తయారీ రంగంలోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. టారిఫ్‌ల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ ప్రభావంతో ఇప్పటికే అనేక ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయి. అమెరికా మార్కెట్‌లోకి మనం ప్రవేశించడం కష్టంగా మారింది’’ అని థరూర్‌ పేర్కొన్నారు. అయితే, అమెరికాతో భారత్‌ సంప్రదింపులు కొనసాగిస్తుండటం మంచి పరిణామమేనన్నారు. అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇతర మార్కెట్లకూ మన ఎగుమతులను విస్తృతపరచాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కాగా, ట్రంప్‌ విధించిన సుంకాలు, దౌత్య పరమైన విధానాలపై శశిథరూర్‌ ఇటీవల కొన్నికీలక వ్యాఖ్యలు చేశారు. అధిక సుంకాలు విధించి భారత్‌ను దూరం చేసుకుంటే అమెరికాకే తీవ్ర నష్టమని హెచ్చరించారు. ఈ వైఖరి వల్ల భారత్ చైనా, రష్యా వంటి దేశాలకు దగ్గరవుతుందని వ్యాఖ్య ‘క్వాడ్’ కూటమి బలహీనపడుతుందని, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. భారత్‌తో అమెరికా అనుసరిస్తున్న సుంకాల యుద్ధాన్ని తక్షణమే విరమించుకోకపోతే భవిష్యత్తులో అమెరికా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad