Saturday, November 15, 2025
Homeనేషనల్Supreme Court: సోషల్ మీడియాలో వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court: సోషల్ మీడియాలో వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court on Hate Speech: సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, డిజిటల్ సమాచార వ్యాప్తి పెరిగిన ఈ యుగంలో, విద్వేష ప్రసంగాలు పెద్దఎత్తున వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజల మధ్య కలహాలు రెచ్చగొట్టేలా ఉన్న ఈ తరహా వ్యాఖ్యలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు తాజాగా ఒక కీలక తీర్పు వెలువరించింది. భావ ప్రకటనా స్వేచ్ఛను భంగపరచకుండా, విద్వేష ప్రసంగాలపై కేంద్రం మరియు రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ చర్యలు సెన్సార్‌షిప్‌ మాదిరిగా కాకుండా, బాధ్యతాయుత వ్యవహారంగా ఉండాలనీ, ప్రజల హక్కులకు భంగం కలగకూడదనీ సూచించింది.

- Advertisement -

ఈ వ్యాఖ్యలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠా పనోలీపై వజహత్ ఖాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా వెలువడ్డాయి. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, ‘‘విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారికి అవి ఎంత హానికరంగా ఉంటాయో అర్థం కావడం లేదు. ఇవి సమాజంలో అసహనం, విభజనకు దారితీస్తాయి. ఇలా వ్యాఖ్యల్ని షేర్ చేయకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది,’’ అని అభిప్రాయపడింది.

ఇక సామాజిక మాధ్యమాల్లో విద్వేష ప్రసంగం విజృంభిస్తుండటంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఇక్కడ మేము సెన్సార్‌షిప్‌ గురించి మాట్లాడటం లేదు. కానీ ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ వాక్ స్వాతంత్య్ర విలువను గౌరవిస్తూ, సామాజిక బాధ్యతను గుర్తించాలి. విద్వేషాన్ని వ్యాప్తి చేసే కామెంట్లను షేర్ చేయకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది’’ అని సూచించింది.

సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన మౌలిక హక్కుల్లో ఒకటి. అయితే దీనిని అనర్హంగా ఉపయోగించడం ద్వారా ఇతరుల హక్కులకు హాని కలిగించటం, సమాజాన్ని విడదీసే ప్రయత్నాలు చేయడం బహుళ వాదనల సమాజానికి ప్రమాదకరం. అంతేకాదు, ‘‘ఇలాంటి కేసుల్లో ప్రభుత్వ జోక్యం అవసరమవకపోయినా, స్పష్టమైన మార్గదర్శకాలు, విధానాలు ఉండటం తప్పనిసరి’’ అని కూడా కోర్టు అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విద్వేష ప్రసంగాలను నియంత్రించేలా నిబంధనలు రూపొందించాలి, అవే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా వహించాలి’’ అని పేర్కొంది.

సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుత ప్రవర్తన ఎందుకు అవసరం?

నేటి డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మీడియా పాఠకులే కాకుండా కంటెంట్ క్రియేటర్లుగా మారారు. ఒక ట్వీట్, ఫేస్‌బుక్ పోస్ట్, లేదా యూట్యూబ్ వీడియో మిలియన్ల మందికి చేరే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో బాధ్యత గల కామెంట్లు, షేర్లు, పోస్టులు చేయడం అనేది ఒక్కొక్కరి సామాజిక బాధ్యత. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది మనలో ప్రతివారికీ ఉన్న హక్కు. కానీ, అదే హక్కును ఇతరులను దెబ్బతీసేందుకు వాడుకుంటే అది హక్కు కాదని బాధ్యతల లోపమని గుర్తించాలి. విద్వేష ప్రసంగాలు చేసే వారికి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో, అభివ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించడంలో న్యాయస్థానాల స్పష్టత ప్రజల హక్కులకు బలాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరికీ ఒక సున్నితమైన సూత్రం గుర్తుంచుకోవాలి. “స్వేచ్ఛ అంటే, అది ఇతరుల హక్కుల ముగింపు వరకే!”

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad