Homeనేషనల్Judiciary : బాటసారుల భద్రతకు ఫుట్‌పాత్ బాట - పౌరుల హక్కులపై సర్వోన్నత న్యాయస్థానం...

Judiciary : బాటసారుల భద్రతకు ఫుట్‌పాత్ బాట – పౌరుల హక్కులపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు!

Supreme Court order on pedestrian footpath rights : దేశంలో అడుగు బయటపెడితే చాలు… వేగంగా దూసుకొచ్చే మోటారు వాహనాల నడుమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అడుగులు వేయాల్సిన దుస్థితి నేడు ప్రతీ బాటసారికీ ఎదురవుతోంది. రహదారులపై ఫుట్‌పాత్‌లు ఆక్రమణల పాలవ్వడం, నడవడానికి సరైన స్థలం లేకపోవడంతో నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ తీవ్రమైన సమస్యపై దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) చారిత్రాత్మకమైన, కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇకపై ప్రతి రహదారిపైనా పాదచారులకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

- Advertisement -

ఫుట్‌పాత్‌పై నడవడం ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు : దేశంలోని ప్రతీ పౌరుడికి సురక్షితమైన రహదారి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(డి) ప్రకారం దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా సంచరించే హక్కు, అలాగే ఆర్టికల్ 21 ప్రకారం లభించిన జీవించే హక్కులో పాదచారుల భద్రత అంతర్భాగమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రత్యేకంగా గుర్తించిన పాదచారుల మార్గాల్లో మోటారు వాహనాల రాకపోకల కంటే నడిచే పౌరుల హక్కులకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని న్యాయస్థానం ఉద్ఘాటించింది.

భారీ ఖర్చు లేకుండానే తాత్కాలిక ఏర్పాట్లు – ధర్మాసనం దిశానిర్దేశం : ఈ అంశంపై లోతుగా విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) కేఎం నటరాజ్‌కు పలు కీలక సూచనలు చేసింది.

తాత్కాలిక గుర్తులు: “పాదచారులకు ప్రత్యేక మార్గాన్ని కేటాయించేందుకు రూ.కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తాళ్లు, రంగులు లేదా ఇతర తాత్కాలిక గుర్తులను ఉపయోగించి వాహనాల రహదారి నుంచి నడిచే మార్గాన్ని స్పష్టంగా వేరు చేయండి” అని సూచించింది. పాదచారుల కోసం కేటాయించిన స్థలంలో ఎటువంటి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వాహనాల భయం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా నడిచే పరిస్థితిని కల్పించాలని స్పష్టం చేసింది.

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు – 2 వారాల గడువు : రహదారుల నిర్మాణంలోనూ, పరిరక్షణలోనూ పాదచారుల రక్షణే ధ్యేయంగా సంబంధిత శాఖలన్నింటికీ అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రానికి రెండు వారాల గడువు విధించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News