Homeనేషనల్NEET FIRs Withdrawal: విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ... సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

NEET FIRs Withdrawal: విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ… సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

Supreme Court on NEET protest FIR withdrawal :  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించింది. జూలై 28న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల రాష్ట్రాలు కేసుల ఉపసంహరణ ప్రక్రియలో అయోమయానికి గురవుతున్నాయని పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం – “భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) లేదా పాత సీఆర్‌పీసీ సెక్షన్ 321 కింద కేసులను వెనక్కి తీసుకునే అధికారం, స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టబద్ధంగా ఉందన్నది స్పష్టం. జూలై 28 ఉత్తర్వులు ఈ అధికారాన్ని ఏమాత్రం అడ్డుకోవు” అని తేల్చిచెప్పింది.

- Advertisement -

నేర చరిత్ర’  పదానికి నయా భాష్యం: విద్యార్థుల భవిష్యత్తుకు గ్రహణం పడకుండా సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వివరణ ఇచ్చింది. పూర్వ నేర చరిత్ర ఉన్నవారికి కేసుల ఉపసంహరణ వెసులుబాటు వర్తించదని గతంలో పేర్కొన్నప్పటికీ, ఆ పదానికి ధర్మాసనం నూతన భాష్యం చెప్పింది.

తీవ్రమైన నేరాలు : హత్యలు, తీవ్రమైన దాడులు లేదా జాతీయ భద్రతకు భంగం కలిగించే ఘోరమైన నేరారోపణలు ఉన్నవారిని మాత్రమే ‘నేర చరిత్ర’ కలిగినవారిగా పరిగణించాలని వెల్లడించింది. నిరసనల్లో భాగంగా చిన్నపాటి చట్ట ఉల్లంఘనలు లేదా సాధారణ ధర్నాలు చేసిన విద్యార్థులపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లను ఎత్తివేసేందుకు రాష్ట్రాలకు పూర్తి హక్కు ఉందని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం హామీ – చట్టపరమైన బాట: కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదనలు వినిపిస్తూ – నిరసనలు విరమించే క్రమంలో విద్యార్థులకు ఇచ్చిన అభయహస్తానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విన్నవించారు. కేసుల ఎత్తివేతపై ఎలాంటి సందేహం లేదని, సాంకేతిక మరియు చట్టపరమైన మార్గాల ద్వారా రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి విద్యార్థులకు పూర్తి రక్షణ కల్పిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.

పోలీసుల అతిక్రమణలపై స్వతంత్ర విచారణ: ఒకవైపు విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తూనే, మరోవైపు జూలై 20నాటి ‘చలో సంసద్’ నిరసనల సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై కూడా కోర్టు దృష్టిసారించింది. నిరసనకారులపై పోలీసులు విచక్షణారహితంగా పెల్లెట్ గన్లు, శక్తివంతమైన బలప్రయోగం చేశారన్న ఆరోపణలతో పాటు, వందలాది మంది పోలీసు సిబ్బంది కూడా గాయపడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు కోర్టు వెల్లడించింది. అంతేకాకుండా డ్రోన్ ఫుటేజీలు, సీసీటీవీ దృశ్యాలు, వాకీటాకీ సంభాషణల డిజిటల్ ఆధారాలను సురక్షితంగా భద్రపరచాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News