Thursday, April 17, 2025
Homeనేషనల్Supreme Court: తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Supreme Court: తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో(Supreme Court) భారీ ఊరట దక్కింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ రవి(Governor RN Ravi) ఆమోదించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ చర్య చట్ట విరుద్ధం, ఏకపక్షం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లులు నిలిపివేసిన తేదీ దగ్గర నుంచి ఆమోదం పొందినట్లు పరిగణించబడుతుందని జస్టిస్ జెబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -

అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టాలిన్ ప్రభుత్వం పంపించిన 10 కీలక బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ అడ్డుకున్నారు. దీంతో ఈ చర్యను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారించిన న్యాయస్థానం గవర్నర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News