Saturday, November 15, 2025
Homeనేషనల్Supreme Court : మానవత్వానికి పట్టం కడుతూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Supreme Court : మానవత్వానికి పట్టం కడుతూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Supreme Court on inmate release rules : శిక్షాకాలం పూర్తికాకుండానే జైళ్లలో మగ్గిపోతూ, ప్రాణాంతక వ్యాధులతో, వృద్ధాప్యంతో కుమిలిపోతున్న ఖైదీల జీవితాల్లో (Sarvochcha Nyayalaya – Supreme Court) వెలుగు రేఖలు ప్రసరింపజేసింది. వారి విడుదల విషయంలో రాష్ట్రాలకో నీతి ఉండరాదని స్పష్టం చేస్తూ, దేశవ్యాప్తంగా ఒకే రకమైన విధివిధానాలు ఉండాలని చారిత్రక ఆదేశాలు జారీ చేసింది. అసలు న్యాయస్థానం ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది..? ఈ ఆదేశం క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది..?

- Advertisement -


దేశంలోని జైళ్లలో మానవత్వానికి పట్టం కడుతూ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న, 70 ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీల అకాల విడుదల విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకే రకమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించాలని నిర్దేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. “జైళ్ల నిర్వహణ అనేది రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినప్పటికీ, మానవతా దృక్పథంతో ముడిపడిన ఇలాంటి విషయంలో దేశవ్యాప్తంగా ఒకేరకమైన కారుణ్య విధానం అవసరం,” అని ధర్మాసనం స్పష్టం చేసింది.

NALSA పిటిషన్‌తో వెలుగులోకి : జాతీయ న్యాయ సేవల అథారిటీ (NALSA) దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం ఈ ఆదేశాలకు మూలం. “దేశంలోని అనేక జైళ్లలో వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలు సరైన వైద్యం అందక, కనీస సాయం కూడా నోచుకోలేని దుస్థితిలో ఉన్నారు. జైళ్లు కిక్కిరిసిపోయి ఉండటంతో (2022 డిసెంబర్ నాటికి ఆక్యుపెన్సీ రేటు 131%), అధికారులు కూడా వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోతున్నారు. వారిని క్షమాభిక్ష కింద విడుదల చేసేందుకు ఒక విధానం తీసుకురావాలి,” అని NALSA తన పిటిషన్‌లో కోరింది. కేరళలో 94 ఏళ్ల ఖైదీ, దిల్లీలో దశాబ్దాలుగా ఆస్తమాతో బాధపడుతున్న ఖైదీ వంటి ఉదాహరణలను కోర్టు దృష్టికి తెచ్చింది.

కేంద్రం సానుకూల స్పందన: ఈ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. “ఇలాంటి ఖైదీల విడుదల అంశాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు క్షమాభిక్ష విధానంలో భాగంగా పరిగణించాలని కేంద్ర హోం శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉంది,” అని ఆమె కోర్టుకు తెలిపారు.

దుర్వినియోగానికి తావులేకుండా:  అయితే, ఈ విధానం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. “ప్రాణాంతక వ్యాధి” అనేదాన్ని ఎవరు నిర్ధారించాలి? అనే ప్రశ్నకు, ప్రతి జైలులో సంబంధిత వైద్య అధికారి ధ్రువీకరించాలని, అవసరమైతే ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వైద్య బోర్డును ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలించాలని సూచించింది. ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి నిబంధనలు ఉన్నాయని ఆ రాష్ట్ర న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించి, ఒక స్పష్టమైన, మానవతా దృక్పథంతో కూడిన విధానాన్ని రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad