Saturday, July 12, 2025
Homeనేషనల్Indias First Solar Bus Station: సూరత్‌లో దేశంలోనే తొలి సోలార్ బస్‌స్టేషన్ ఆవిష్కరణ!

Indias First Solar Bus Station: సూరత్‌లో దేశంలోనే తొలి సోలార్ బస్‌స్టేషన్ ఆవిష్కరణ!

A Green Revolution In Public Transportation: వాతావరణ మార్పులు, ఇంధన సంక్షోభం ప్రపంచాన్ని వెంటాడుతున్న తరుణంలో, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం అనివార్యంగా మారింది. ఈ దిశగా భారతదేశం వేస్తున్న అడుగులు అభినందనీయం. దేశంలోనే తొలిసారిగా ‘సౌర బస్‌స్టేషన్’ను ఏర్పాటు చేసి, గుజరాత్‌లోని సూరత్ నగరం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ వినూత్న ప్రాజెక్ట్ కేవలం ఇంధన పొదుపుకే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు, అధునాతన ప్రజా రవాణా వ్యవస్థకు ఎలా దోహదపడుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే, ఈ అద్భుతమైన ఆవిష్కరణ కథనం మీకోసమే..!

- Advertisement -

సూరత్ బస్ స్టేషన్‌తో సరికొత్త రికార్డు:

భారతదేశపు మొట్టమొదటి సోలార్ బస్ స్టేషన్! భారతదేశంలో హరిత రవాణా (గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్) దిశగా గుజరాత్‌లోని సూరత్ నగరం ఓ విప్లవాత్మక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి సౌరశక్తితో నడిచే బస్‌స్టేషన్‌ను ఆవిష్కరించి, పర్యావరణ పరిరక్షణకు, సుస్థిర రవాణాకు ఆదర్శంగా నిలిచింది.

సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (SMC) ఆధ్వర్యంలో, ఆల్తాన్‌ ప్రాంతంలో సుమారు రూ. 1.60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ‘స్మార్ట్ బస్‌స్టేషన్’, సూరత్ నగరానికి సరికొత్త మైలురాయిగా మారనుంది. ఇది కేవలం ప్రయాణ సౌలభ్యాన్ని మాత్రమే కాకుండా, పర్యావరణ స్పృహను కూడా పెంపొందిస్తుంది. ఈ బస్‌స్టేషన్ ద్వారా సౌరశక్తి వినియోగానికి, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థకు సూరత్ సరికొత్త ప్రమాణాలను నిర్దేశించింది.

అత్యాధునిక సౌకర్యాలు:

ఈ హైటెక్ ఎలక్ట్రిక్ బస్‌స్టేషన్‌లో ఛార్జింగ్, Wi-Fi వంటి అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. దీని విశిష్టత ఏమిటంటే, రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్, సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకు 24 గంటల పాటు “గ్రీన్ ఛార్జింగ్” సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అంటే, విద్యుత్ గ్రిడ్‌పై ఆధారపడకుండా, పూర్తిగా సౌరశక్తితోనే ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్ చేయవచ్చు.

జర్మన్ సహకారంతో నిర్మాణం:

సూరత్‌లోని ఆల్తాన్‌లో వంద కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను జర్మన్ సంస్థ GIZ సహకారంతో రూపొందించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్, సాంకేతిక పరిజ్ఞానం, పునరుత్పాదక ఇంధన వినియోగం పట్ల భారతదేశ నిబద్ధతను చాటిచెబుతోంది.

ఆర్థిక ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ:

లైట్ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సెల్’ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రకాశ్ భాయ్ పాండ్యా ఈ ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ, దేశంలోనే మొదటిసారిగా సూరత్‌లోని ఆల్తాన్‌లో నిర్మించిన ఈ సోలార్ ఆధారిత బస్ డిపోలో 100 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్, 224 KWH గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రూ.1.60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ బస్ డిపో నుంచి ఏటా సుమారు లక్ష యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దీని వల్ల సుమారు రూ.6.65 లక్షల విలువైన ఎనర్జీ ఆదా అవుతుందని ఆయన వెల్లడించారు.

గ్రిడ్‌పై భారం తగ్గింపు:

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను “సెకండ్ లైఫ్ బ్యాటరీలలో” నిల్వ చేస్తారు. వీటితో రాత్రిపూట ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జ్ చేయడం వల్ల గ్రిడ్‌పై భారం గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా పునరుత్పాదక శక్తిని ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా, కర్బన ఉద్గారాలను తగ్గించి, వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

దేశానికే ఆదర్శం: గ్రీన్ ఇండియాకు సూరత్ మార్గం:

ఈ బస్ స్టాప్ కేవలం ప్రయాణికులకు ఓ ఆశ్రయం కాదు, ఇది ప్రజా రవాణాను పర్యావరణపరంగా, సాంకేతికంగా అభివృద్ధి పథం వైపు నడిపించే ఓ ప్రయోగం. ఇంధన ఆదా, పర్యావరణ పరిరక్షణతో ముడిపడి ఉన్న ఈ పైలట్ ప్రాజెక్ట్, దేశానికే గొప్ప స్ఫూర్తినిస్తోంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇలాంటి గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టులు విస్తరించడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. ‘గ్రీన్ ఇండియా’ లక్ష్య సాధనలో సూరత్ చేపట్టిన ఈ చొరవ నిజంగా ప్రశంసనీయ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News