Tesla India Launch: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో ప్రవేశానికి రెడీగా ఉండి. బొంబాయిలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్ లో తమ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్లోల ఈ బ్రాండ్ ఒక మైలురాయిగా మారనుంది. టెస్లా నుంచి తన సరికొత్త మోడల్ అయిన ‘వై’ ఎస్యూవీని మన దేశంలో విక్రయించేందుకు సిద్ధమైంది. అయితే దీని రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) కారు వేరియంట్ ధర రూ. 60 లక్షలు (ఆన్-రోడ్ ప్రైస్ రూ. 61 లక్షలు), లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ కారు వేరియంట్ ను రూ. 68 లక్షలకు విక్రయించనున్నారు.
అయితే ఈ వాహనాలు చైనాలోని టెస్లా షాంఘై గిగాఫ్యాక్టరీ నుంచి సరాసరి దిగుమతి కానున్నాయి. భారత దేశంలో ఈ మోడల్ ‘వై’ వేరియంట్ ధరలు అమెరికాలో (44,990 డాలర్లు), చైనాలో (2,63,500 యువాన్), జర్మనీలో (45,970 యూరోలు)తో పోలిస్తే ధర ఎక్కువగా ఉంది. అధిక ధరకి కారణం 70 శాతం దిగుమతి సుంకం, లాజిస్టిక్స్ ఖర్చులే అందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఐదు కార్లు చైనా నుంచి ముంబయికి చేరుకున్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ఓ ఏరియాలో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెస్లా సెంటర్ ఏఱ్పాటు చేశారు. అయితే షో రూమ్ ప్రారంభంలో టెస్ట్ డ్రైవ్, కారు డెలివరీలు ఉండవు. భారత్లోని న్యూఢిల్లీలో టెస్లా మరో షో రూమ్ను తెరవనుంది.
ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల చేసిన మోడల్ ‘వై’ లోపలి భాగం నలుపు-తెలుపు రంగులతో అందుబాటులోకి రానుంది. ఎన్నో అధునాతన సాంకేతికతో అద్భుమైన ఫీచర్లను కలిగి ఉంది. ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్, ఆటోపైలట్ టెక్నాలజీ ఈ వాహనం ప్రత్యేకతలు. అయితే మన భారత రహదారుపై ఆటోపైలట్ పనితీరు మరింత పరీక్షించాల్సి ఉంది.
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఈవీలపై దిగుమతి సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించారు. దీంతో టెస్లా లాంటి గ్లోబల్ కంపెనీలను ఆకర్షించినట్లు అయ్యింది.


