Thursday, July 4, 2024
Homeనేషనల్Maharashtra: పిక్నిక్‌కు వెళ్లొస్తుండగా బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి.. పలువురికి గాయాలు

Maharashtra: పిక్నిక్‌కు వెళ్లొస్తుండగా బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి.. పలువురికి గాయాలు

Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది. పిక్నిక్‌కు వెళ్లొస్తుండగా బస్సు బోల్తా పడటంతో ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని, రాయ్‌గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగింది. మహారాష్ట్ర, ముంబైలోని సబర్బన్ ప్రాంతమైన చెంబూర్‌కు చెందిన కొందరు స్కూలు విద్యార్థులు పిక్నిక్‌కు వెళ్లారు. పిక్నిక్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఆదివారం రాత్రి బస్సు బోల్తా పడింది. ముంబై-పూనే హైవేపై, లోనావాలా సమీపంలో ఈ ఘటన జరిగింది.

- Advertisement -

బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ పట్టు కోల్పోయాడు. దీంతో ప్రమాదం జరిగింది. ఈ సమయంలో బస్సులో 49 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో వీరంతా ప్రమాదానికి గురయ్యారు. ఇందులో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హితికా ఖన్నా, రాజ్ రాజేష్ మాత్రేగా గుర్తించారు. వీరిద్దరూ పదహారేళ్ల లోపు వాళ్లే. ఈ ప్రమాదంలో మిగతా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థులంతా పదో తరగతి చదువుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News