Sunday, July 7, 2024
Homeనేషనల్Accident: శబరిమల యాత్రలో విషాదం.. 8 మంది భక్తుల మృతి!

Accident: శబరిమల యాత్రలో విషాదం.. 8 మంది భక్తుల మృతి!

- Advertisement -

Accident: శబరిమల యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. కేరళ ఇడుక్కిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగినట్లు గుర్తించారు.

తమిళనాడు నుంచి యాత్రికులతో ప్రయాణిస్తున్న వాహనం కుమిలి-కంబం రహదారిపై వెళ్తుండగా అదుపుతప్పి వాగులో పడింది. ఆ వాహనంలో చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఎత్తు నుంచి పడటం వలన వాహనం పూర్తిగా ధ్వసం కాగా.. ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. చనిపోయిన వారు, గాయపడిన ఇద్దరు కాకుండా ఇందులో మరో ముగ్గురు చిక్కుకుని ఉన్నట్లు పోలీసులు భావిస్తుండగా.. వాళ్ళని బయటకి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా, మృతులంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించగా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రకడానికి గల కారణాలేమీ ఇంకా తెలియకపోగా..
డ్రైవర్ నిద్రమత్తు వలనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News