TVK Vijay In Delhi for CBI Inquiry: కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ కేసు విచారణలో పాల్గొనేందుకు టీవీకే అధినేత విజయ్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరారు. రెండో విడత సీబీఐ విచారణకు ఆయన సోమవారం హాజరుకానున్నారు.
గతేడాదితో సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో భారీ తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించారు. ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా, ఇప్పటికే ఒకసారి జనవరి 12న విజయ్ సీబీఐ ఎదుట విచారణకు హాజరు కాగా.. మరోసారి విచారణకు సహకరించాల్సిందని ఆయనకు సమన్లు పంపించారు.
Also Read: https://teluguprabha.net/national-news/rahul-gandhi-mgnrega-protest-rae-bareli/
ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలో సీబీఐ ఎదుట రెండో విడత విచారణకు విజయ్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
జనవరి 12న జరిగిన విచారణలో విజయ్ దాదాపు 6 గంటల పాటు విచారణకు హాజరు కాగా.. సంక్రాంతి పండుగ కారణంగా తదుపరి విచారణకు సమయం కోరారు. దీంతో సీబీఐ ఇప్పుడు మళ్లీ సమన్లు జారీ చేసింది.
కాగా, త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ ఇప్పటికే తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తయారీకి 12 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. అదేవిధంగా ప్రచార కార్యకలాపాల కోసం 10 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది.

