Friday, June 13, 2025
Homeనేషనల్Plane Crash: విమానంలో మాజీ సీఎం.. ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి

Plane Crash: విమానంలో మాజీ సీఎం.. ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి

Plane Crash: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా కుప్పకూలిన ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

‘అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం షాక్ కు గురించి. ఈ దుర్ఘటన గురించి తెలసి చాలా బాధపడ్డాను. అత్యంత అప్రమత్తంగా ఉన్నాము. నేను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను. స‌హాయ‌క బృందాలు ఇప్ప‌టికే ఘ‌ట‌నాస్థ‌లిలో ఉన్నాయి. మూడు బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైన‌ట్లు పేర్కొన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులకు ఏం కాకుండా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన గుజరాత్‌కు బయల్దేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ తో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మధ్యాహ్నం 1.17 గంటలకు ఎయిరిండియాకు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 2 నిమిషాలకే కూలిపోయింది. విమానంలో మొత్తం 254 మంది ఉండగా.. వీరిలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రమాదంతో ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఎయిర్ పోర్టుతో పాటు సమీపంలోని అన్ని రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం కూలిన ఘటన తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News