Teacher suspended for misconduct : భవిష్యత్ తరాలను క్రమశిక్షణతో, విద్యాబుద్ధులతో తీర్చిదిద్దాల్సిన పవిత్ర దేవాలయం బడి. ఆ బడిలో గురువే దారి తప్పితే…? పాఠాలు చెప్పాల్సిన చేతులతో.. విద్యార్థులతో సేవలు చేయించుకుంటే..? సరిగ్గా ఇలాంటి ఓ బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా నిలిచే ఘటనే ఉత్తరప్రదేశ్లో వెలుగుచూసింది.
వేలకు వేలు జీతం తీసుకుంటున్న ఓ ఉపాధ్యాయురాలు, తరగతి గదిలోనే మొబైల్ ఫోన్లో పాటలు వింటూ, పిల్లలతో హెడ్ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. అసలు ఎక్కడ జరిగింది ఈ ఘటన? ఆ టీచరమ్మపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
బడిలో రాచభోగం.. గురువు నిర్వాకం
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో విద్యార్థులందరూ చూస్తుండగానే, ఓ టీచరమ్మ కుర్చీలో దర్జాగా కూర్చుని తన మొబైల్ ఫోన్లో పాత పాటలు పెట్టుకుని వింటోంది. అంతటితో ఆగకుండా, తలకు నూనె రాసుకుంటూ, ఓ విద్యార్థితో చక్కగా హెడ్ మసాజ్ చేయించుకుంది. ఈ మొత్తం తతంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది క్షణాల్లో వైరల్గా మారింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి నిర్లక్ష్య వైఖరిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
A video of a primary school in Bulandshahr, UP is going viral on social media which shows, a teacher doing head massage and oiling her hair while playing classical songs on mobile phone in the classroom in front of the students.
The teacher is also accused of misbehaving with… pic.twitter.com/7NFerM7XTp
— ForMenIndia (@ForMenIndia_) July 21, 2025
కంచే చేను మేసిన చందంగా.. ఆ టీచరే ప్రిన్సిపల్!
ఈ ఘటనలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఈ నిర్వాకానికి పాల్పడింది ఎవరో సాధారణ ఉపాధ్యాయురాలు కాదు, ఆ పాఠశాలకే ప్రధానోపాధ్యాయురాలు (ప్రిన్సిపల్). పాఠశాలను, తోటి ఉపాధ్యాయులను, విద్యార్థులను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఆమె ప్రవర్తించిన తీరు తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
పాత ఆరోపణలు.. దురుసు ప్రవర్తన
ఈ ప్రిన్సిపల్పై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనల గురించి గతంలో ప్రశ్నించిన కొందరు విద్యార్థుల తల్లిదండ్రులతో ఆమె దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, కర్రతో దాడికి పాల్పడినట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు.
తక్షణ చర్యలు.. సస్పెన్షన్ వేటు
వీడియో వైరల్ కావడంతో, ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న జిల్లా ప్రాథమిక విద్యా అధికారి, తక్షణమే విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో, ఆ ప్రధానోపాధ్యాయురాలిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


