Saturday, November 15, 2025
Homeనేషనల్Green Tax: వాహనదారులకు షాక్.. ఇకపై బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై గ్రీన్ ట్యాక్స్

Green Tax: వాహనదారులకు షాక్.. ఇకపై బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై గ్రీన్ ట్యాక్స్

Uttarakhand Green Tax on Out-of-State Vehicles: కాలుష్యాన్ని నియంత్రించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, రాష్ట్రంలో పరిశుభ్రతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల నుంచి బయటి రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని వాహనాలపై ‘గ్రీన్ ట్యాక్స్’ (పర్యావరణ పన్ను) వసూలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

- Advertisement -

పర్యాటక ప్రాంతమైన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. ఈ వాహనాల వల్ల పెరిగే కాలుష్యం, పర్యావరణంపై పడే భారాన్ని తగ్గించేందుకు ఈ పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు.

ఏ వాహనానికి ఎంత పన్ను?

వివిధ రకాల వాహనాలకు వేర్వేరు పన్ను రేట్లను ప్రభుత్వం నిర్ణయించింది.

  • చిన్న వాహనాలు (కార్లు): రూ. 80
  • చిన్న కార్గో వాహనాలు: రూ. 250
  • బస్సులు: రూ. 140
  • ట్రక్కులు (బరువును బట్టి): రూ. 120 నుంచి రూ. 700 వరకు

ALSO READ: Karur Stampede CBI: కరూర్ తొక్కిసలాట.. 41 మంది మృతి కేసు సీబీఐకి… సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

ఆటోమేటిక్ టెక్నాలజీతో వసూలు

ఈ గ్రీన్ ట్యాక్స్ వసూలు ప్రక్రియ పూర్తిగా సాంకేతికత ఆధారంగా జరగనుంది. రాష్ట్ర సరిహద్దుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఏర్పాటు చేశారు.

రాష్ట్ర అదనపు రవాణా కమిషనర్ సనత్ కుమార్ సింగ్ శనివారం మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే 16 కెమెరాలు ఉండగా, వాటి సంఖ్యను ఇప్పుడు 37కి పెంచినట్లు తెలిపారు. ఈ కెమెరాలు రాష్ట్రంలోకి వచ్చే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను నమోదు చేస్తాయి.

ALSO READ: Aurangabad Station: ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ పేరు మార్పు.. ఇకపై ఛత్రపతి శంభాజీనగర్‌గా పిలవాలని ఉత్తుర్వులు జారీ

కెమెరాల ద్వారా సేకరించిన డేటాను సాఫ్ట్‌వేర్ ద్వారా ట్యాక్స్ వసూలు కోసం నియమించిన వెండర్ కంపెనీకి పంపుతారు. ఈ డేటా నుంచి ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు, ప్రభుత్వ వాహనాలు, ద్విచక్ర వాహనాలను వేరు చేసి, మిగిలిన వాహనాల వివరాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటాబేస్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి ఆయా వాహన యజమానుల వాలెట్ నంబర్‌లను గుర్తించి, ట్యాక్స్ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా (స్వయంచాలకంగా) వసూలు చేసి రవాణా శాఖ ఖాతాలో జమ చేస్తారని అధికారులు వివరించారు.

ALSO READ: Chhath Puja Begins: 36 గంటల నిర్జల దీక్ష.. అర్చకులు లేని ఆరాధన! ఛఠ్ పూజ మహాపర్వం ప్రారంభం!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad