Sunday, July 7, 2024
Homeనేషనల్WB: కేంద్ర మంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి

WB: కేంద్ర మంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రికే రక్షణ లేకుండా పోయిందంటే ఇక సామాన్యుల సంగతేం చెప్పాలి అన్నట్టు తయారైంది. పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న మంత్రి నిసిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. తృణముల్ కాంగ్రెస్ మద్దతుదారులు ఈ దాడిలో పాల్గొన్నట్టు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ దాడిలో కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న ఎస్ యు వీ కారు విండ్షీల్డ్ పగిలిపోయింది. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు భాష్పవాయువును ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టారు. కూచ్ బిహార్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేంద్ర మంత్రి ప్రమాణిక్.

- Advertisement -

బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు అనవసరంగా ఓ గిరిజనుడిని పొట్టనపెట్టుకోవటంపై వీరంతా ఆందోళనకు దిగి, మంత్రిపై రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. గిరిజనుడి మృతికి కారణం కేంద్ర ప్రభుత్వం స్థానిక బీజేపీ నేత ప్రమాణిక్ అంటూ గత కొన్ని రోజులుగా టీఎంసీ పదేపదే ఊదరగొడుతూ, జనాన్ని రెచ్చగొడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News