పలు దేశాల్లో ‘వారసత్వ పాలన’కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై మనీష్ తివారీ ఒక పోస్ట్ పెట్టారు. “శ్రీలంకలో అధ్యక్షులు గొటబయ రాజపక్ష పదవి నుంచి తప్పుకోవడం, బంగ్లాదేశ్లో షేక్ హసీనా అధికారం కోల్పోవడం, నేపాల్లో కేపీ శర్మ ఓలి నిష్క్రమించడం, ఇప్పుడు ఫిలిప్పీన్స్లో ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యువతరం ఇకపై వారసత్వ పాలనను అంగీకరించడం లేదు,” అని తివారీ తన పోస్ట్లో పేర్కొన్నారు. దీంతో బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాల్వియా వెంటనే స్పందిస్తూ, తివారీ వ్యాఖ్యలు రాహుల్ గాంధీని ఉద్దేశించినవేనని ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత రాజకీయాల్లో ‘అల్టిమేట్ నెపో కిడ్’ అని మాల్వియా ఎద్దేవా చేశారు.
Senior Congress leader Manish Tewari, member of the G-23 rebel group, takes aim at Rahul Gandhi — the ultimate ‘Nepo Kid’ of Indian politics.
Forget Gen Z, even Congress’s own veterans are fed up with his regressive politics. The revolt is now from within! https://t.co/v8HoxXKgG9
— Amit Malviya (@amitmalviya) September 23, 2025
ALSO READ: Tax evasion: లగ్జరీ కార్ల పన్ను ఎగవేత.. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై దాడులు
దీనికి కౌంటర్గా మనీష్ తివారీ, “సౌత్ ఆసియా, ఈస్ట్ ఆసియాలో జరుగుతున్న పరిణామాలు దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటిని సరైన కోణంలో అర్థం చేసుకోవాలి,” అని ట్వీట్ చేశారు. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటులో చర్చ సందర్భంగా తివారీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆయన పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా “నా నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేని వారు నా మాటలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు,” అని వ్యాఖ్యానించారు. ఈ తాజా వివాదం కాంగ్రెస్లో అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Gosh I just wish that some people would grow up in life .
Everything does not have to be dumbed down to a Cong – BJP he said she said or targeting X or Y.
What is happening in South Asia and East Asia has serious National Security implications and why it is happening needs… https://t.co/brzQF7qGrM
— Manish Tewari (@ManishTewari) September 23, 2025


