Friday, September 20, 2024
HomeNewsDevanakonda: ప్రత్యక్ష రాజకీయాలలోకి పాటిల్ హిమవర్షా రెడ్డి

Devanakonda: ప్రత్యక్ష రాజకీయాలలోకి పాటిల్ హిమవర్షా రెడ్డి

మాజీ ఎమ్మెల్యేలు నీరజారెడ్డి శేషిరెడ్డిల ఏకైక కుమార్తె హిమవర్షారెడ్డి తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రత్యక్ష రాజకీయాలలోకి విచ్చేయనున్నట్టు ఆమె ప్రకటించారు. ఆమె మండల పరిధిలోని తెర్నేకల్ గ్రామంలో ఈ మధ్యనే మరణించిన తన తల్లి మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి కార్యక్రమం స్వగృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆమె మాట్లాడుతూ తల్లిని తండ్రిని చిన్న వయసులో పోగొట్టుకున్నానని ఆవేదన చెందారు. తల్లిదండ్రులు లేరని తాను ఎక్కడికో వెళ్తానని అనుకోవద్దని ఇక్కడే ఉండి కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజకీయాలు తనకు కొత్త కాదు అని నాన్న మరణించాక అమ్మకు ప్రచారం కోసం చిన్న వయసులోనే నియోజకవర్గంలో తిరిగానని గుర్తు చేశారు. పత్తికొండ నియోజకవర్గం నుండి నాన్న, ఆలూరు నియోజకవర్గం నుండి అమ్మ గెలుపొంది అనేకమంది కార్యకర్తలకు అండగా ఉండే వారన్నారు. కావున అమ్మను నాన్నను ఆదరించినట్టుగానే పత్తికొండ ,ఆలూరు రెండు నియోజకవర్గాలలోని ప్రజలు కార్యకర్తలు తనను కూడా ఆదరిస్తే మీకు సేవ చేసుకుంటారని
కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఏ నియోజకవర్గం నుండి ఏ పార్టీ నుండి అనేది ప్రకటిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News