The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సలార్ లాంటి భారీ యాక్షన్ మూవీ తర్వాత ప్రభాస్ రొమాంటిక్ హారర్ జోనర్ లో నటించడం ఆసక్తికరమైన విషయం. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మోషన్స్ టీజర్స్, పోస్టర్స్.. ఇటీవల వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
టీజర్ రిలీజ్ రోజున మీడియా వారికి రాజాసాబ్ సెట్స్ ని చూపించారు. ఇక్కడే ఈ సీన్ తీసింది..ఇక్కడే ప్రభాస్ ఫైట్స్ చేసింది అంటూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశారు. ఇదే సమయంలో రాజాసాబ్ సినిమా స్టోరీ ఇదేనంటూ నెట్టింట రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు మారుతి తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
రాజాసాబ్ మూవీ ఒక ఎమోషనల్ స్టోరీ. ఇండియన్ స్క్రీన్స్పై ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకూ రాలేదు. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది..అని చెప్పారు. రాజాసాబ్ లో తాత-మనవడి కథను చూపించనున్నాం. స్క్రీన్పై చూసిన తర్వాత ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ అని మారుతి చెప్పారు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డారు.. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించడానికి టీం అంతా శ్రమిస్తోంది..అని మారుతి అన్నారు. ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ మూవీగా ‘ది రాజా సాబ్’ సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేశాము. హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ అందించడానికి భారీగా ఖర్చు చేస్తున్నాము. ఇదంతా కథను, ప్రభాస్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నాము అని మారుతి తెలిపారు.
‘ప్రభాస్ సినిమా అంటే అందరిలో భారీగా అంచనాలుంటాయి. ఆ అంచనాలకి తగ్గట్టుగానే వీఎఫ్ఎక్స్ మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టాము. అందరినీ సర్ప్రైజ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నాము. నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవలేదు..అని మారుతి తెలిపారు. దీంతో ఈ సినిమా హాలీవుడ్ రేంలో ఉండబోతుందని బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ నమోదు చేస్తుందని ఊహించుకుంటున్నారు. మారుతి ఇప్పటి వరకు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తీయలేదు. ఇదే ఆయనకి మొదటిది. ఈ సినిమా గనక బ్లాక్ బస్టర్ అయితే ఆయన కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోతారు.