Friday, September 20, 2024
HomeNewsEmmiganuru: రైతులు కష్టాలు తీరాలంటే బాబు రావాలి

Emmiganuru: రైతులు కష్టాలు తీరాలంటే బాబు రావాలి

రైతుకు ఆర్థిక సాయం

రైతులు కష్టాలు తీరాలంటే చంద్రబాబుకు పట్టం కట్టాలని, రైతును దగా చేసిన సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడాలని ఎమ్మిగనూరు నియోజకవర్గం టిడిపి నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ లో కూరగాయల వేలం మార్కెట్, ఎద్దుల మార్కెట్ యందు, మేకల బజార్ లో తిరిగి బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పై మాచాని సోమనాథ్ ప్రచారం నిర్వహించారు. రైతులను కలుసుకొని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, బాధలను విన్నారు. పల్లెలు కరువు కోరల్లో చిక్కుకొని వలసలు బాట పట్టారని, పశుగ్రాసం లేక పశువులను కమేళ్ళాలకు విక్రయిస్తున్నామని ఓ రైతు ఆవేదనతో డా. మాచాని సోమనాథ్ దృష్టికి తీసుకొచ్చారు. మరో రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు శరణ్యంగా మారాయని కన్నీరు పెట్టుకున్నారు.

- Advertisement -

చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇప్పె నరసప్ప, తెలుగు మహిళ నాయకురాలు గోకారమ్మ,రోజా ఆర్ట్స్ ఉసేని, కే.ఎం.డి.అబ్దుల్ జబ్బర్, కంపాడు చిన్న రంగన్న, మైనార్టీ నాయకులు గోరా భాష, జోహార్ అబ్బాస్, ఆఫ్గాన్ వలి భాష, మాసుమాన్ దొడ్డి బోయ శ్రీనివాసులు, ధన పాల్గొన్నారు.

గోనెగండ్ల మండల పరిధిలోని వేముగోడు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా బాణాసంచా పేల్చడంతో గ్రామ సమీపంలో ఉన్న వాముదొడ్డిలో గడ్డివాము కాలిపోయి రైతుకు భారీ నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న డాక్టర్ మాచాని సోమనాథ్ తన వంతు సహాయంగా ఆ రైతుకు ఆర్థికంగా తన వంతు సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఏ రైతు కూడా ఇకనుంచి ఇబ్బంది పడకూడదని గ్రామ ప్రజలకు మరియు నియోజకవర్గ రైతులందరికీ ఏ కష్టం వచ్చినా ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు పట్టణంలో మునిసిపల్ 10వ వార్డు నందు పెద్ద కమేళా సమీపంలో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు మాలిన్ అనే వృద్ధురాలుకు సంబంధించిన గుడిసె పూర్తిగా దగ్ధమై సర్వం కోల్పోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మాచాని సోమనాథ్ బాధితురాలు ఇంటికి చేరుకొని దగ్ధమైన గుడిసెను పరిశీలించి చలించిపోయి..ఈ మేరకు ఆర్థిక సాయం అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News