Wednesday, September 18, 2024
HomeNewsFake currency: నకిలీ నోట్ల కలకలం లబో దిబోమంటున్న బాధితులు

Fake currency: నకిలీ నోట్ల కలకలం లబో దిబోమంటున్న బాధితులు

హొళగుందలో నకిలీ నోట్లు చాలామణి అవుతుండడంతో దుకాణదారులు, వ్యాపారస్తులు, మిరప, వరి ధాన్యం అమ్ముకుంటున్న రైతులు, సామాన్య ప్రజలకు ఏది నకిలో, ఏది ఒరిజినలో తెలియక నష్టపోయి లబోదిబోమంటున్నారు. మండల కేంద్రంలోని ఓ సూపర్ మార్కెట్ యాజమాని లక్ష రూపాయల నగదు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లగా అందులో ఓ 500 నోటు సిరీస్ నెంబర్ 4HQ 983934 నకిలీదిగా గుర్తించి వెంటనే ఆ యజమాని ముందే బ్యాంకు అధికారులు కాల్చేశారు. ఇటీవల ఓ వ్యాపారి వద్ద 200 నోటు నికలిదిగా గుర్తించారు. నకిలీ నోట్ల దందా పెరగకముందే అధికారులు దీనిపై చర్య తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News