Saturday, June 14, 2025
HomeNewsJadcharla: ఔత్సాహికులు టెండర్ లో పాల్గొనాలి

Jadcharla: ఔత్సాహికులు టెండర్ లో పాల్గొనాలి

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దగుట్ట శ్రీ రంగనాయక స్వామి గుట్టపై వచ్చే నెలలో జరిగే శ్రావణ మాస ఉత్సవాలలో భాగంగా గుట్టపై తైబజార్, టెంకాయలు, పులిహోర, లడ్డు ప్రసాదం, విక్రయించేందుకు దుకాణాల ఏర్పాటు కొరకు ఈనెల 28న ఆదివారం ఉదయం 10 గంటలకు బాదేపల్లి పాత బజార్ హనుమాన్ దేవాలయంలో నిర్వహించే టెండర్ వేలం కార్యక్రమంలో ఔత్సాహికులు పాల్గొని డిపాజిట్ రూ.5 వేలు చెల్లించి టెండర్ వేలంలో పాల్గొనాలని దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రామ్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. దేవాలయ అభివృద్ధి కోసం వేస్తున్న టెండర్ కార్యక్రమంలో ఔత్సాహిక వ్యాపారస్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News