తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని మంత్రి వర్యులు సీతక్క అన్నారు. ఈ రోజు తాడ్వాయి మండలంలోని మినీ మేడారం సందర్భంగా వన దేవతలకు మొక్కులు చెల్లించారు మంత్రి సీతక్క.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/a5e84fd2-962e-432b-a5a6-b9e93c3c6460-1024x682.jpg)
తెలంగాణ కుంభమేళా
అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాటు చేసిందని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రింకింగ్ వాటర్, క్యూ లైన్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశామని ఎప్పటికప్పుడు అధికారులు జాతర పై దృష్టి పెట్టి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని, ఈ మినీ మేడారం జాతరకు ఇప్పటికే సుమారు 6 లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించారని తెలిపారు. ఇంకా రెండు రోజుల పాటు సాగే తెలంగాణ కుంభ మేళ మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా బస్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం, జంపన్న వాగు ఒడ్డున స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/5bde3e25-22c2-4a43-bcc7-fcb51a751379-1024x682.jpg)
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాణోత్ రవి చందర్ తో పాటు పూజారులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/c6eeaf41-8511-453d-9f78-0d566241b096-1024x682.jpg)