Sunday, July 7, 2024
HomeNewsమెగా ఫ్యామిలీ లో మెగా సంబరాలు..పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

మెగా ఫ్యామిలీ లో మెగా సంబరాలు..పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

- Advertisement -

మెగా ఫ్యామిలీ లో మెగా సంబరాలు మొదలయ్యాయి. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చారు. చిరంజీవి కుటుంబంలో మూడో తరం అడుగుపెట్టింది. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలోఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది.

ఉపాసన డెలివరీ కోసం సోమవారం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు తల్లి, చిరంజీవి సతీమణి సురేఖ, చరణ్ కూడా హాస్పటల్‌కు వెళ్లడం జరిగింది. కాగా, బిడ్డ పుట్టడంతో రామ్ చరణ్ రెండు నెలలు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఈ రెండు నెలలు భార్య, కుతురుతో గడపనున్నారు. 2012లో వివాహ బంధం తో ఒకటైన చరణ్ – ఉపాసన లు రీసెంట్ గా పెళ్లి రోజు జరుపుకోవడం జరిగింది. పాప పుట్టిన సంగ‌తి తెలియ‌గానే కుటుంబ స‌భ్యుల‌తో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే..స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ అనే భారీ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జూలై నెల‌లో శంక‌ర్ మూవీకి సంబంధించిన షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ రిక్వెస్ట్ మేర‌కు షెడ్యూల్‌ను ఆగ‌స్ట్‌కి మార్చారు. ఉపాస‌న‌కు డెలివ‌రీ అయిన కొన్ని రోజుల వ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీతోనే త‌న స‌మ‌యం గ‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకోవ‌ట‌మే అందుకు కారణం. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వాని హీరోయిన్. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News