Friday, September 20, 2024
HomeNewsRamagundam: రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసా

Ramagundam: రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసా

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకిచ్చిన హామిలను నేరవేర్చాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ  ప్రజలకిచ్చిన హామీల అమలుపై రాష్ట్ర డిప్యూటీ సిఎం బట్టీ విక్రమార్క  ఖచ్చితమైన సమాధానం చెప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేసారు. 

- Advertisement -

గోదావరిఖని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 8 నేలల కాలం గడుస్తున్న  ప్రజలకిచ్చిన హామిలను అమలు పర్చలేదన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలుకాలేదని, వృద్దుల కు 4 వేల ఫించన్ మహిళలకు నెలకు 2500 విద్యార్థులకు స్కూటీలు రైరు భరోసా పెంపు లాంటి హామీల అమలు కోసం ప్రజలందరు ఎదురుచూస్తున్నారని అన్నారు.

ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వస్తున్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఖచ్చితమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రామగుండం అభివృద్ధి కోసం తొలి సిఎం కేసీఆర్‌  కోట్లాది రూపాయలు వెచ్చిచారన్నారు. రామగుండం అభివృద్ధి కోసం నవ నిర్మాణ సభ ఏర్పాటు చేసి  అప్పటి రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్  ద్వారా 30  IT పార్క్  అంతర్గాం మండల కేంద్రంలో  వంద ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ లకు  శంకుస్థాపన చేయుంచామన్నారు. గతంలో మాంజూరైనా  అభివృద్ధి కొనసాగించాలన్నారు. 

రామగుండం ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్ ఎర్పాటు కోసం సన్నాహాలు చెయడం సంతోషకరమైన విషయమని, జేన్ కో పని చేస్తున్న ఉద్యోగుల కోరుకునే విధంగా జేన్ కో  ద్వారా విద్యుత్  ప్లాంట్ నిర్మాణం చేపట్థాలన్నారు.  జేన్ ప్లాంట్ నిర్మాణం చేపడితే స్దానికంగా యువతకు విద్యుత్ ప్లాంట్ ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసి అముల నారాయణ,  కార్పొరేటర్ గాధం, విజయ, బోడ్డు రవీందర్, మెతుకు దేవరాజ్, పిల్లి రమేష్, చల్లగురుగుల మెగిలి, నూతి తిరుపతి, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, గుంపుల లక్ష్మి, యాసర్ల తిమెాతి, కొడి రామకృష్ణ, కిరణ్ జీ, పాలడుగుల కనకరాజ్, అవునూరి వెంకటేష్, రామరాజు, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News