Thursday, September 19, 2024
HomeNewsVardhannapeta: ముచ్చటగా మూడోసారి అధికారం మాదే

Vardhannapeta: ముచ్చటగా మూడోసారి అధికారం మాదే

100 సీట్లు గెలుస్తాం

వర్ధన్నపేట నియోజకవర్గంలోని భట్టుపల్లిలో నిర్వహించే ప్రజా దీవెన సభ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లు పాల్గొని మాట్లాడుతూ.. అనేక సభలు నిర్వహించి, 10 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. 80 వేల మందితో ప్రజా దీవెన సభను ఏర్పాటు చేస్తున్నామని, ముచ్చటగా మూడోసారి కూడా కెసిఆర్ సంక్షేమ పథకాలు పార్టీని గెలిపిస్తాయని అన్నారు. పథకాల గురించి విమర్శించే అర్హత ప్రతిపక్ష పార్టీలకు లేవన్నారు. పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహభరితంగా పనిచేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పథకాల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక మోడల్ గా తయారైంది అన్నారు. దేశ ప్రజలు కేసిఆర్ ను కోరుకుంటున్నారని అన్నారు. గ్యారంటీ లేని, వారంటీ లేని పథకాలతో కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో అమలుపరిచే విషయంలో ఫెయిల్ అయిందన్నారు. అమలుకు సాధ్యం కాని పథకాలతో కాంగ్రెస్ పార్టీ దగా చేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి మ్యానిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా చూసి వాటిని అమలు చేస్తున్నామని, బిఆర్ఎస్ పార్టీ మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమని, 100 సీట్లకు పైగా గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు.

- Advertisement -

అధిక మెజారిటీ ఇచ్చి, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అనంతరం సభ ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు, సభా వేదిక,హేలిప్యాడ్ కు సంబంధించిన స్థలాన్ని పరిశీలి oచారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, డిసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి,మేయర్ గుండు సుధా రాణి, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షురాలు లలిత యాదవ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, నాయకులు వనం రెడ్డి, పోలపల్లి రామ్మూర్తి, ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News