Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Akhila Priya: చంద్రబాబు, లోకేష్ కు అఖిలప్రియ థాంక్స్

Akhila Priya: చంద్రబాబు, లోకేష్ కు అఖిలప్రియ థాంక్స్

అందరినీ కలుపుకుపోయి గెలుస్తా

ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ పేరును జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విడుదల చేసిన తొలి జాబితాలో ప్రకటించడంతో ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద టపాసులు పేల్చి ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలు నాయకులు భూమా నివాసానికి చేరుకొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు, నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నుంచి కూడా పార్టీ తనకు మంచి గుర్తింపును ఇచ్చి తనను ఈ స్థానంలో నిలబెట్టారన్నారు. తనపై ఎంతో నమ్మకంతో టికెట్ను కేటాయించిన చంద్రబాబు నాయుడు ఆశలను వమ్ము చేయకుండా తాను కూడా భారీ మెజారిటీతో ఇక్కడి నుండి విజయం సాధిస్తామని తెలిపారు. తాను మొదటి నుండి ఎవరిని కించపరిచి మాట్లాడలేదని అందరినీ కలుపుకొని, రానున్న ఎన్నికలలో పనిచేస్తానని తెలిపారు. కార్యకర్తలు అండగా నిలుస్తామని అఖిలప్రియ స్పష్టం చేశారు.

నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి, చింతకుంట జాఫర్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి చాంద్బాషా, ఆళ్ల నాగ శ్రీనివాసులు, నక్కలదిన్నె శ్రీనివాస్ రెడ్డి, నన్నే భాయ్ గారి జిలాని, టిడిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News