Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Allagadda: చంద్రబాబు సమక్షంలో పార్టీలోకి గోగిశెట్టి

Allagadda: చంద్రబాబు సమక్షంలో పార్టీలోకి గోగిశెట్టి

నంద్యాల టీడీపీలో కొత్త ఉత్సాహం

టిడిపి అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సిఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో హైకోర్టు న్యాయవాది డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు, ఆయన కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో టిడిపి పార్టీలోచేరారు. పార్టీలోకి చేరిన అందరికీ చంద్రబాబు నాయుడు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అంతకు ముందు శిరివెళ్ల మండల పరిధిలోని వీరారెడ్డి పల్లె గ్రామం నుండి గోగిశెట్టి నరసింహారావు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భర్తభార్గవరామ్, భూమా జగద్విఖ్యాత రెడ్డితో కలిసి అభిమానులు, కార్యకర్తలు,మాజీ సర్పంచులు, నాయకులతో భారీ ఎత్తున వాహనాలలో భారీ జనసందోహంతో బనగానపల్లెలోని గాలి సుబ్బారెడ్డి ఫంక్షన్ హాల్ కు బయలుదేరి వెళ్లి… మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు.

- Advertisement -

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలు అన్ని రంగాల్లో రాణించేలా తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో టిడిపి హయంలోనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. వైసిపి కుళ్లూ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారని, వైసిపి ఆగడాలు ఇక సాగవన్నారు.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రభుత్వంపై తిరగబడ దానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా పార్టీల చేరిన హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తదితర ప్రముఖుల సమక్షంలో పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విధానాలు నచ్చి ఈ రోజు తాను స్వచ్ఛందంగా పార్టీలో చేరానన్నారు. వందలాది వాహనాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన టిడిపి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్ని ఆయన హామీ ఇచ్చారు. గోగిశెట్టి నరసింహారావు టిడిపిలో చేరిన సందర్భంగా నంద్యాల జిల్లా టిడిపిలో నూతన ఉత్తేజం నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News