Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Aluru: ఆలూరు టీడిపి టిక్కెట్ సుజాతమ్మకే ఇవ్వాలి

Aluru: ఆలూరు టీడిపి టిక్కెట్ సుజాతమ్మకే ఇవ్వాలి

కష్టకాలంలో మా అందరికీ అండగా ఉన్నది ఆమెనే

ఆలూరు అసెంబ్లీ టీడీపీ సీటును కోట్ల సుజాతమ్మకే ఇవ్వాలని మొలగవల్లి గ్రామ వైస్ సర్పంచ్ రంగన్న అధిష్టానాన్ని కోరారు. ఆలూరు టీడిపి కార్యలయంలో ఆయన విలేఖులతో మాట్లాడారు. 5 ఏళ్ల పాటు టీడిపి పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతూ, కార్యకర్తలకు అండగా ఉంటున్న అమెను కాదని వేరొకరికి ఇస్తే పార్టీకీ రాజీనామా చేస్తామని ప్రకటించారు.

- Advertisement -

ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ నాయకులను ఉత్తేజ పరుస్తూ అత్యధిక స్థానాల్లో టీడిపి మద్దతుదారులను గెలిపించారన్నారు. అలాంటి వ్యక్తికి ఆలూరు సీటు ఇవ్వాలన్నారు. ఆయనతో పాటు వార్డు సభ్యులు ఐకాంత్, జలందర్, హుసేని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News