Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Andole: గడప గడపకు మీ ఇంటి ఆడబిడ్డ త్రిష

Andole: గడప గడపకు మీ ఇంటి ఆడబిడ్డ త్రిష

39 రోజులుగా సాగుతున్న యాత్ర

మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ సిడబ్ల్యుసి కుమార్తె త్రిష ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండల్ పోల్కపల్లి గ్రామంలో గడప గడపకు కార్యక్రమం చేపట్టారు. మునిపల్లి మండలంలో పోల్కంపల్లి గ్రామంలో “గడప గడపకు మీ ఇంటి ఆడ బిడ్డ త్రిష” పేరుతో ఈ పాదయాత్ర కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. నేటితో త్రిష యాత్ర 39 రోజులు పూర్తి చేసుకుంది. ఆందోల్ నియోజకవర్గాన్ని గడప గడపకూ ఈమె చుట్టేస్తున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె అయిన త్రిష ప్రజల సమస్యలన్నీ సావధానంగా వింటూ ప్రజల్లో మమేకం అవుతున్నారు.

- Advertisement -

పోల్కంపల్లి గ్రామ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తామని త్రిషకి మాట ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షుడు తాటిపల్లి రాంరెడ్డి, మునిపల్లి సుధాకర్ ఎంపిటిసి, గొర్రె గట్టు సంగమేశ్వర్ ఉపసర్పంచ్, పెద్ద గోపారం పోల్కంపల్లి ఎంపీటీసీ బురకల పాండు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News