Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్BRS: మహారాష్ట్రలో విస్తరిస్తున్న బీఆర్ఎస్

BRS: మహారాష్ట్రలో విస్తరిస్తున్న బీఆర్ఎస్

మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ ప్రకంపనలు సృష్టిస్తోంది . రోజు రోజుకూ బి ఆర్ ఎస్ లో చేరే ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. ఉగాది పండుగ రోజే బి ఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పలువురు ప్రముఖులు బి ఆర్ ఎస్ లో చేరారు. వారికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలోని కాందహార్ లోహలో బి ఆర్ ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రముఖులు బి ఆర్ ఎస్ లో చేరటం విశేషం.

- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే ఈ సభలో ఇంకా భారీ చేరికలు ఉంటాయని బి ఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో చేరిన వారిలో ప్రముఖులు హర్షవర్ధన్ జాదవ్ , సురేష్ గైక్వాడ్ , యెష్ పాల్ బింగే తో పాటు పలువురు బి ఆర్ ఎస్ లో చేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News